అమరావతి
రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొగ్రెస్ రిపోర్ట్
ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్ను మీడియాకు ప్రజెంట్ చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
• 2019-24 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ప్రజలను వేధించింది. ఆ ప్రభుత్వం ప్రజలను అణగదొక్కింది.. దీంతో నిశ్శబ్ధ విప్లవం వచ్చింది.
• 57 శాతం ఓట్లు మాకు వచ్చాయి.. 94 శాతం స్ట్రైక్ రేటుతో సీట్లు సాధించాం.
• ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాం.. మాసివ్ విక్టరీ సాధించాం.
• ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏడు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం.
• ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నాం… ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం.
• ఇరిగేషన్, స్టీల్, ఏఐ, ఐటీ, ఫార్మా వంటి రంగాలను ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేస్తున్నాం.
• 2014లో విభజన జరిగింది… ఏపీ వ్యవసాయాధారిత రెవెన్యూ రాష్ట్రంగా ఏర్పడింది.
• రాజధానిని కోల్పోయాం… ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి.. బస్సులో బస చేసి పాలన చేపట్టాం.
• విభజన సందర్భంగా వచ్చిన నష్టాన్ని భరించాం… కానీ 2019-24 మధ్యలో విధ్వంసం జరిగింది.
• వ్యవస్థలను నిర్వీర్యం చేశారు… ప్రజలు, అధికారులు, పోలీసులు అంతా భయపడిపోయే పరిస్థితి.
• అన్ని వ్యవస్థలపై దాడి చేశారు.. ఏపీ బ్రాండ్ను కూడా దారుణంగా దెబ్బతీశారు.
• ఇతర ప్రాంతాల్లో ఏపీ వాసులంటే చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది.
• ఏపీలో తమ కంపెనీలను పెట్టమని పారిశ్రామిక వేత్తలు పారిపోయిన పరిస్థితి.
అమరావతి
రాష్ట్రంలో రెండేళ్ల పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం
• 2019-24 మధ్య ప్రజలు భయంతో, రాష్ట్రంలో విధ్వంసంతో జీవనం గడిపారు
• 2024లో ఎన్డీఏ విజయం ఊహించని విప్లవం. అధికారంలోకి వచ్చాక 7 శ్వేత పత్రాలు ఇచ్చాం
• రెండేళ్ల పాలన తర్వాత వివిధ అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేస్తున్నాం
• ఎనర్జీ, అమరావతి, జలవనరులు తదితర అంశాలపై ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చాం
• ఇవాళ ఆర్ధిక పరిస్థితిపై సమగ్రంగా నివేదిక ఇస్తున్నాం
• ఒక ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయం ఓ ఉదాహరణ
• ఉత్తరాంధ్ర అంతా కదలి వచ్చింది. అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏపీకి గేట్ వే
• డేటా సెంటర్లు, ఐటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, స్టీల్ పరిశ్రమలతో ఓ గ్రోత్ ఇంజన్గా మారుతోంది
• 2014లో విభజన తర్వాత ఏపీ పరిస్థితి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారింది
• 58 శాతం మంది జనాభా ఉంటే 46 శాతమే వనరులు ఉన్నాయి. రాజధాని లేదు.
• విభజనలో ఆస్తుల పంపకం కూడా సవ్యంగా జరగలేదు.
• 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైంది. ఆర్ధికంగా నష్టపోయాం
• వ్యవస్థలు కుప్పకూలాయి. శాంతిభద్రతలు లేవు. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. పరిశ్రమలు పారిపోయాయి
• 2024లో కూటమి అధికారంలోకి వస్తూనే ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం
• సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని, ప్రాంతీయ సమతుల్యతను కాపాడాం
• రాజధానితో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టాం
• ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టాం