అమరావతి
సచివాలయంలో ముగిసిన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం
వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు
• వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలి. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలి
• రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి.
• డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయి… రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలి.
• ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి… అప్పుడే అన్ని రంగాల్లో బడుగులూ ఎదుగుతారు
• బడుగుల కోసం ప్రభుత్వాలుగా మేం చేయాల్సింది చేస్తున్నాం… బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందే
• అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి… పేద-ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలి.
• రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం.
• బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.
• 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం… నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలి.
• డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే… ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలి
• టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు
• ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదు
• ఈ సమస్య పరిష్కారానికి మావైపు నుంచి ప్రయత్నిస్తున్నాం… బ్యాంకర్లు కూడా సహకరించాలి
• డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారు… బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలి
• భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం… గత ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించింది.
• ఇప్పుడు భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నాం
• క్యూఆర్ కోడ్ ఇస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం
• బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించండి















































