18.10.2023
అమరావతి
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలని వారికి చేదోడునిస్తూ…
వరుసగా నాలుగో ఏడాది..
‘జగనన్న చేదోడు”
రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో నేడు (19.10.2023) బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి….
షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం.. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం, అందించిన జగనన్న ప్రభుత్వం..
నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు..
1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి..
39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ..
1,04,551 మంది రజకులకు ఈ విడత సాయంగా రూ. 104.55 కోట్ల లబ్ధి..
లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక..
ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం…
అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ – పథకాల లబ్ది అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ. జూన్, డిసెంబర్ లలో లబ్దిని – అందచేస్తున్న జగనన్న ప్రభుత్వం.
జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటి వరకు అందించిన లబ్ధి..
2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం (రూ. కోట్లలో) 298.12
2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం (రూ. కోట్లలో) 299.23
2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం (రూ. కోట్లలో) 330.15
2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020 సాయం (రూ. కోట్లలో) 325.02
మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు.