విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం:
విశాఖలో టెక్ తమ్మిన (Tech Tammina) సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
విశాఖపట్నం:
విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి (Tech Tammina (Sree Tammina Software Solutions Pvt. Ltd) విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ముందుగా హిల్ నెం-2లోని సంస్థ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టెక్ తమ్మిన సంస్థ భవన నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో టెక్ తమ్మిన సీఈవో రాజ్ తమ్మిన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కేవీఎస్జేవీ శాస్త్రి, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్-2లో నాన్ రెల్ టెక్నాలజీస్ (Nonrel Technologies Private Limited) యూనిట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హిల్ నెంబర్-2లోని సంస్థ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విశాఖలో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో నాన్ రెల్ టెక్నాలజీస్ ఎండీ వినయ్ బాబు మేక, సీఈవో పవన్ కుమార్ సామినేని, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
విశాఖపట్నం: విశాఖ భీమిలిలోని కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd) సంస్థకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇమాజిన్నోవేట్ సంస్థ సీఈవో వి.భార్గవ్ కృష్ణ, డైరెక్టర్ వి. కృష్ణప్రియ, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




























































