అమరావతి:
విట్-ఎపి విశ్వవిద్యాలయం మరియు బివిఆర్సియంట్, సియంట్ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం
ది . 18 మార్చి 2025 న విఐటి -ఏపి విశ్వవిద్యాలయం మరియు సియంట్ ఫౌండేషన్, (సియంట్ లిమిటెడ్ యొక్క సిఎస్ఆర్ సంస్థ ) మరియు డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ మరియు ఎంట్రెప్రెనూర్ షిప్ (బివిఆర్సైంట్) సహకారంతో అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ అవగాహనా ఒప్పొందం ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని వరుస సహకార కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం.
ఈ అవగాహనా ఒప్పందంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ విద్యను మెరుగుపరచడానికి బూట్క్యాంప్లు, హ్యాకథాన్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్లు, ఐపి మరియు ఉత్పత్తి నిర్వహణ వర్క్షాప్లు మరియు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించటానికి ఉపయోగ పడుతుంది.
సియంట్ ఫౌండేషన్, (సియంట్ లిమిటెడ్ యొక్క సిఎస్ఆర్ సంస్థ ) మరియు డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ మరియు ఎంట్రెప్రెనూర్ షిప్ (బివిఆర్సైంట్) లతో అవగాహనా ఒప్పొందం చేసుకోవటం చాల ఆనందంగా ఉందని విఐటి-ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి అన్నారు. ఈ భాగస్వామ్యం కొత్త తరం టెక్నాలజీ-ఆవిష్కరణలు రూపొందించడంలో సహాయపడుతుంది అని తెలియచేసారు.
డాక్టర్ సుధాకర్ పొటుకుచి (సిఇఒ – బివిఆర్ సైంట్) మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరం ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులను ప్రేరేపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని , వ్యవస్థాపక ఆకాంక్షలు మరియు వ్యవస్థాపకత యొక్క సామర్థ్యం మరియు సామర్థ్యాలను పెంచటానికి ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో డా|| అమిత్ చవాన్ (ఐఐఈసి డైరెక్టర్, విఐటి-ఏపి), డా|| ఎస్.వి. కోటా రెడ్డి (వైస్ ఛాన్సలర్, విఐటి-ఏపి), డా|| సుధాకర్ పొటుకుచి (సిఇఒ – బివిఆర్ సైంట్), కృష్ణ మోహన్ దీవి , డా|| పిఎన్ఎస్వి నరసింహం పాల్గొన్నారు.