శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరణ
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు ఆదేశాలు
” బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం
ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించాం
భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం.
స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు.
ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు.
బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి.
ఈయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉంది.”
అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.


















































