ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన, సిఐఐ సమ్మిట్ అప్ డేట్స్
సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఈరోజు సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నేరుగా విశాఖ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్న సిఎం చంద్రబాబు
• నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అధికారులు, మంత్రులతో సమీక్షించనున్న సిఎం చంద్రబాబు
• ఈరోజు రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో భేటీ కానున్న సిఎం చంద్రబాబు
• నేటి నుంచి 4 రోజుల పాటు వరుసగా వన్ టు వన్ భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో విశాఖ నుంచి పాల్గొననున్న సీఎం
నవంబర్ 13, గురువారం
• భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో గురువారం వరుస భేటీలు
• గురువారం నోవాటెల్ హోటల్ లో ఉదయం ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశం’లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
• ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ – సస్టైనబుల్ గ్రోత్పై ప్రారంభ సెషన్ లో పాల్గొననున్న సిఎం
• తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు
• ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై జరిగే కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
• సి.ఐ.ఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు
• గురువారం చివరిగా నెట్వర్క్ డిన్నర్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
నవంబర్ 14, శుక్రవారం
• నవంబర్ 14న సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
• సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
• సమావేశానికి విచ్చేయనున్న వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
• మొదటగా ఏపీ పెవిలియన్కు ప్రారంభోత్సవం
• ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం
• సదస్సు నుంచే ఎపిలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల ప్రారంభం
• సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం
• ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం ముఖ్య ప్రసంగం
• విశాఖలో లులూ మాల్కు శంకుస్థాపన
• శుక్రవారం చివరిగా బిజినెస్ టుడే ఇంటర్వ్యూ, గాలా డిన్నర్కు సీఎం
నవంబర్ 15, శనివారం
నవంబర్ 15న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు
• గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు
• బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీలు
• ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు
• మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ‘ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ
• ‘ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్ : ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్’ పై సీఎం సమీక్ష
• సదస్పులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా బ్రీఫింగ్, వాలెడిక్టరీ సెషన్ నిర్వహణ
• మొత్తంగా సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు
• అలాగే ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలు
• ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు, భారీఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహణ
• విశాఖ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• సదస్సుల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడుల కు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం
• సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే దేశ విదేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ రోడ్ షోలు, పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఇతర మంత్రులు



































