శ్రామిక చట్టాలకు నూతన శకం

కార్మికశాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భారతదేశంలో శ్రామిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది.కేవలం చారిత్రక సంస్కరణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని మరియు భద్రతను కల్పించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
కేంద్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంతో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయి. దశాబ్ధాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్ధానంలో నాలుగు కార్మికకోడ్ లను అమలు చేయడంవల్ల దేశ వ్యాప్తంగా కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
నూతన కార్మిక చట్టాలు దేశాభివృద్దికి బాటలు వేసే సంస్కరణలు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుంది.
సరళత,పారదర్శకత, సమర్ధత,కార్మికుల సంక్షేమానికి నాలుగు నూతన కార్మిక చట్టాలు దోహదపడతాయి. నూతన చట్టాల వల్ల కీలక మార్పులతో అందరికీ సాంఘీక భద్రత, అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్ పార్మ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందే అవకాశం లభించింది.
నూతన కార్మిక చట్టాలతో పరిశ్రమలకు సరళీ కృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరిగేలా వ్యవస్ధను రూపొందించారు. అంతేకాకుండా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, తదితర అంశాలు ఈ చట్టాలతో మెరుగైన పద్దతిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయి.
ఇప్పటివరకు ఉన్న 29 పాత కార్మిక చట్టాలను సరళతరం చేస్తూ, దేశంలోని 40 కోట్ల మందికి పైగా కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలకు హామీ లభిస్తున్నది.
దేశంలోని 40 కోట్ల మంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటితక రంగాల్లోనిలక్షలాది మంది కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలను లభించనున్నాయి.
తాజా కోడ్లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్లా దేశవ్యాప్తంగా ఈఎస్ ఐ సౌకర్యం కల్పించడం, సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చు.
మనదేశంలో 1930- 50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికి అమలు లో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవనే ఆందోళనలు ఉన్న సంగతి విదితమే.
దశాబ్ధాల నాటి పరిస్ధితులకు అనుగుణంగా రూపొందించిన చట్టాలను అమలు చేయడం వల్ల ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాపారాలు, ఫ్యాక్టరీలకు కష్టంగా మారింది. అలాగే కార్మికులకు సరైన భద్రత, సంక్షేమం అందడం లేదనే ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించేందుకు నూతన కార్మిక కోడ్ లను కేంద్రం రూపొందించడం ద్వారా కార్మికులకు ఎంతో మేలు చేసింది.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేడర్ కోడ్ల ను ప్రకటించింది. వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రతా కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్- 2020 ఇందులో ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి
ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేడర్ కోడ్ల ను ప్రకటించింది. వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రతా కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్- 2020 ఇందులో ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి అన్ని రంగాలకూ వర్తించనున్నాయని…కార్మికుల భద్రత మెరుగుపర్చడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజనాలు లభిస్తాయి అని చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసినట్లు అవుతుందని కేంద్ర ప్రభుతం చెబుతోంది. దీని ద్వారా మెరుగైన కార్మిక, ఉద్యోగ విధానాలు అమలల్లోకి రానున్నాయి.
కార్మికులకు వెసులుబాటు..
కొత్త కార్మిక నియమావళి ప్రకారం అతిపెద్ద మార్పులలో ఒకటి రోజువారీ పని పరిస్థితులు , ఉద్యోగులు ఎంతకాలం పని చేస్తారు, వారు ఎప్పుడు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు, వారు ఎంత ఓవర్ టైం తీసుకోవచ్చు,వారు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలకు అర్హులు లాంటివి నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు, ఉద్యోగులు వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత సాధించడానికి ముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 240 పని దినాలను పూర్తి చేయాల్సి ఉండేది. కొత్త కోడ్లు ఆ అవసరాన్ని 180 రోజులకు తగ్గించాయి. అంటే ఇప్పుడు ఒక కార్మికుడు ఏడాదిలో చాలా ముందుగానే సెలవుకు అర్హుడు అవుతాడు. ఇది తయారీ, వస్త్రాలు, రిటైల్, నిర్మాణం ,హాజరు నియమాలు సాంప్రదాయకంగా కఠినంగా ఉండే ఇతర రంగాలలోని వారికి పెద్ద మార్పు అని చెప్పవచ్చు. దీని వలన కార్మికులకు మరింత విశ్రాంతి దొరుకుతుంది. ఇది దీర్ఘకాలంలో ఉత్పాదకతతో పాటూ ఉద్యోగ సంతృప్తిని మెరుగుపరుస్తుంది.
కొత్త కోడ్ ల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు పని చేయాలనే నియమం అలానే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసేకోవచ్చనేది మాత్రం మారుతుంది. దీనిని వారంలో నాలుగు రోజులు 12 గంటలు, ఐదు రోజులు వారాంలో దాదాపు 9.5 గంటలు, ఆరు రోజులు వారంలో రోజుకు ఎనిమిది గంటలు కింద విభజించుకోవచ్చును. దీంతో పాటూ ఓవర్ టైమ్ పరిమితిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత పరిమితులను నిర్ణయించుకోవచ్చు.
కొత్త కోడ్ లలో మరో ప్రధాన మార్పు..ఆరోగ్యం, వైద్య కవరేజ్. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఉద్యోగికి ఇప్పుడు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ లభిస్తుంది.ముఖ్యంగా ఎక్కువ గంటలు, ప్రమాదకర వాతావరణాలు లేదా శారీరక ఒత్తిడి సాధారణంగా ఉండే రంగాలలో, నివారణ ఆరోగ్య సంరక్షణ వైపు విస్తృత ప్రయత్నంలో ఇది భాగంగా ఉంటుంది. ముఖ్యంగా, తోటల కార్మికులకు ఇప్పుడు గతంలో ఒకే విధంగా అందుబాటులో లేని ESIC వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ నిబంధన కార్మికులకు అనుకూలంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ కోడ్ లను రూపొందించింది.
ప్రతి కార్మికుడికీ గౌరవం కల్పించాలన్నది ఎన్డీయే సర్కారు హామీతో కొత్త కార్మిక స్మృతులు దేశంలో అమల్లోకి వచ్చాయి’’ ఈ కోడ్లతో కార్మికులందరికీ కనీస వేతనాలు లభిస్తాయి, యువతకు నియామక పత్రాలు అందుతాయి, మహిళలకు సమాన వేతనాలు, గౌరవం లభిస్తుంది, 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది, ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగులకు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ వంటివి దక్కుతాయి.‘‘ఈ సంస్కరణలు సాధారణ మార్పులు కాదు. కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్య. స్వయం సమృద్ధ భారత్ దిశగా కీలక ముందడుగు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్గా నిలవాలన్న లక్ష్యానికి ఊతం’’ అని చెప్పడంలో సందేహం లేదు.
వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం



















































